గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్

MLA Satish Kumar: ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద భూ సేకరణ జరుగుతుందన్న ఎమ్మెల్యే

Update: 2022-06-15 10:30 GMT

గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్

MLA Satish Kumar: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే మైనర్లకు ప్యాకేజీ అందిందన్నారు. 2007లో ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్టు 2022లో ట్రైల్ రన్‌కు రావడంతో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ సర్వే నిర్వహిస్తున్న క్రమంలో స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుందని తెలిపారు. లబ్ధిదారులెవరూ ఆందోళన చెందవద్దని తమకు రావాల్సిన ప్యాకేజీ వస్తుందని హామీ ఇచ్చారు. 356 మంది మేజర్ల కోసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద భూ సేకరణ జరుగుతుందన్నారు.

Full View


Tags:    

Similar News