ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

MLA Padma Devender Reddy: మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది.

Update: 2022-03-23 14:31 GMT

ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

MLA Padma Devender Reddy: మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్‌ పట్టణంలో నేడు పర్యటించారు. ఈ పర్యటన అనంతరం రామయంపేటలో ఓ వివాహానికి హాజరయ్యేందుక వెళ్తున్న క్రమంలో అక్కన్నపేట రైల్వేగేట్‌ వద్ద ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును ఎస్కార్ట్‌ వాహనం ఢీ కొట్టింది. దీంతో భారీ శబ్దంతో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి ఉన్న వాహనం ఎరిగిపడింది. అయితే వాహనం వెనుకనుంచి వచ్చి ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు.

Tags:    

Similar News