నూతన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

Update: 2019-06-17 05:58 GMT

హైదర్‌గూడలో సకల హంగులతో నిర్మితమైన శాసనసభ్యుల నివాస గృహ సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ప్రారంభించారు. నాలుగున్నర ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దాదాపు 166 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించారు. ఎమ్మెల్యేలతో పాటు సిబ్బంది, సర్వెంట్ల కుటుంబాలు కూడా ఉండేందుకు వీలుగా ఈ సముదాయాన్ని సిద్ధం చేశారు. మొత్తం 120 మంది సభ్యులు ఉండేందుకు వీలుగా వీటిని నిర్మించారు. ఒక్కో ఫ్లోర్‌లో పదిచొప్పున 12 అంతస్తుల్లో 120 క్వార్టర్స్‌ను నిర్మించారు. ఒక్కోక్వార్టర్‌ను మూడు బెడ్‌రూంలతో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో మొత్తం 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రారంభోత్సవంలో స్పీకర్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News