Puvvada Ajay Kumar: రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది

Puvvada Ajay Kumar: రాష్ట్రానికి కేసీఆర్ పాలన శ్రీరామ రక్ష

Update: 2022-09-22 10:56 GMT

Puvvada Ajay Kumar: రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది

Puvvada Ajay Kumar: రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. గత ప్రభుత్వాలు 70 ఏళ్లలో 700 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే కేసీఆర్ ప్రభుత్వం 1300 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పాలన శ్రీరామ రక్ష అన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 24 గంటలపాటు కరెంట్‌ను సరఫరా చేస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News