రాజకీయ ప్రకంపనలు సృష్టించిన పువ్వాడ వ్యాఖ్యలు

*గ్రామాలను తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదంటున్న మంత్రులు

Update: 2022-07-20 05:26 GMT

రాజకీయ ప్రకంపనలు సృష్టించిన పువ్వాడ వ్యాఖ్యలు

Puvvada Ajay Kumar: పోలవరంపై మంత్రి పువ్వాడ కామెంట్స్ మరోసారి తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిచాయి. భద్రాచలం ముంపునకు గురవ్వడానికి పోలవరంలో నీటి నిల్వనే కారణమని పువ్వాడ వ్యాఖ్యానించారు. ఏపీలో విలీనమైన 7 మండలాల్లోని ఎటపాక, నెల్లిపాక, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం తిరిగి తెలంగాణకు ఇవ్వాలని అజయ్‌ కోరారు. ఈ విధంగా చేయడం వల్ల కరకట్టల నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుందని, భద్రాద్రి ఆలయానికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని సూచించారు. పువ్వాడ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్నారు ఏపీ మంత్రులు. అయిపోయిన వివాదాన్ని మళ్లీ తెరపైకి ఎందుకు తెస్తుున్నారని ప్రశ్నించారు. గ్రామాలను తిరిగిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 

Tags:    

Similar News