1011 గిరిజన కుటుంబాలకు పాస్ పుస్తకాలను పంచిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

Prashanth Reddy: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌ మండలంలో పోడుపట్టాల పంపిణీ

Update: 2023-07-05 09:11 GMT

1011 గిరిజన కుటుంబాలకు పాస్ పుస్తకాలను పంచిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

Prashanth Reddy: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌ మండలంలోని తాళ్లపల్లిలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి లబ్ధిదారులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. దేవక్కపేట్‌, దేవన్‌పల్లి, కారేపల్లి, కుప్కాల్‌, మెండోరా, రహత్‌నగర్‌, సికింద్రాపూర్‌, తాళ్లపల్లి గ్రామాలకు చెందిన అర్హులైన గిరిజన కుటుంబాలకు పోడు పట్టా పుస్తకాలను అందజేశారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతో అడవిబిడ్డలకు భరోసా ఏర్పడిందన్నారు. వారి భావితరాల జీవనోపాధికి కూడా భద్రత లభించిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. 

Tags:    

Similar News