KTR: తెలంగాణలో ఐటీ రంగం పురోగతిలో ఉంది -మంత్రి కేటీఆర్‌

KTR: తెలంగాణలో ఐటీ రంగం పురోగతిలో ఉందన్నారు మంత్రి కేటీఆర్‌.

Update: 2021-04-02 07:59 GMT

కేటీఆర్ ఫైల్ ఫోటో

KTR: తెలంగాణలో ఐటీ రంగం పురోగతిలో ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడతో కలిసి ఐటీ హబ్‌ ఫేజ్‌-2 పనులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయిన కొత్తలో ఉద్యోగాలు వస్తాయా..? అన్న అనుమానాలు.. ఉండేవని, వాటిని పటాపంచెలు చేశామన్నారు. గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు పెద్ద నగరాలను వదిలిపెట్టి, హైదరాబాద్‌కు వస్తున్నాయని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్‌. దేశ వృద్ధి రేటు కన్నా తెలంగాణ అభివృద్ధి రేటు ఎక్కువగా ఉందని అన్నారు కేటీఆర్‌. డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను ప‌రిశీలిస్తున్న క్ర‌మంలో.. ఓ ఇంటిలోని న‌ల్లాను తానే స్వ‌యంగా ఆన్ చేసి నీళ్ల‌ను తాగారు. 

Tags:    

Similar News