బీజేపీ నాయకులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం.. నా పిల్లలపై నీచమైన వ్యాఖ్యలు...

KTR Tweet: *బీజేపీ నేతలకు జేపీ నడ్డా నేర్పిన సంస్కారం ఇదేనా.. *రాజకీయాల్లోకి నా కొడుకును లాగడం సరైనదేనా..

Update: 2021-12-25 07:40 GMT

బీజేపీ నాయకులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం.. నా పిల్లలపై నీచమైన వ్యాఖ్యలు...

KTR Tweet: బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడిపై అభ్యంతర వ్యాఖ్యతు చేశారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. సోషల్ మీడియా.. సంఘ విద్రోహక శక్తులకు అడ్డాగా మారిందని అన్నారు. బీజేపీ మీడియా థర్డ్ గ్రేడ్ నాయకులు తన పిల్లలపై నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ నేతలకు జేపీ నడ్డా నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు. రాజకీయాల్లోకి నా కొడుకును లాగడం సరైనదేనా అని నిలదీశారు. ఇలాగే మోడీ, అమిత్‌షా కుటుంబాలను విమర్శిస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు.


Tags:    

Similar News