నాయిని పాడె మోసిన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌

టీఆర్ఎస్ నేత, మాజీ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో నాయిని అంత్యక్రియలు జరుగుతున్నాయి..

Update: 2020-10-22 10:12 GMT

టీఆర్ఎస్ నేత, మాజీ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో నాయిని అంత్యక్రియలు జరుగుతున్నాయి.. అయన అంత్యక్రియలకి టీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. అయితే అంత్యక్రియల్లో భాగంగా నాయిని పాడెను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ మోశారు. నాయిని చివరి చూపు చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

Tags:    

Similar News