KTR: వరద బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్‌

KTR: రెండ్రోజుల క్రితం సిరిసిల్లాలో జోరువాన

Update: 2021-09-09 01:47 GMT

సిరిసిల్లలో వరద బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్ (ఫైల్ ఇమేజ్)

KTR: రెండ్రోజుల క్రితం సిరిసిల్లాలో వాన దంచికొట్టింది. దాంతో ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇక వరద బాధితులను పరామర్శించడానికి, అలాగే సహాయక చర్యలను పరిశీలించడానికి మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లాకు చేరుకున్నారు. ముందుగా కలెక్టర్‌లోని అధికారులతో సమావేశమైన మంత్రి కేటీఆర్‌.. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద వచ్చిన ఏరియాల్లోని పరిస్థితిని స్వయంగా వెళ్లి పరిశీలించారు. బాధితులకు తాను ఉన్నామంటూ భరోసా కల్పించారు మంత్రి కేటీఆర్‌.

Tags:    

Similar News