కేబినెట్ నుంచి తొలగిస్తారనే ప్రచారం తర్వాత తొలిసారి స్పందించిన ఈటల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఎవరో ఇచ్చిన భిక్ష కాదని ఈటల భావోద్వేగానికి లోనయ్యారు. తాను తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడిన వాడినని 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరి నుంచి ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదని అన్నారు. మేం గులాబీ జెండా ఓనర్లమని అడుక్కునే వాళ్లం కాదని అన్నారు. ఎవరు హీరో ఎవరు జీరో అనే విషయం త్వరలోనే తేలుతుందని ఈటల ఘాటుగా స్పందించారు.