Jyotirao Phule: పూలే కుల వివక్షపై పోరాటం చేసిన మహానుభావుడు: ఎర్రబెల్లి

Jyotirao Phule: కుల వివక్షపై పోరాటం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు

Update: 2021-04-11 10:32 GMT

ఎర్రబెల్లి దయాకర్ ( ఫైల్ ఫోటో )

Jyotirao Phule: కుల వివక్షపై పోరాటం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. పూలే తాను చెప్పిన విషయాలను తుచ తప్పకుండా ఆచరించి చూపారన్నారు. ఒక సాధారణ తోటమాలి కులంలో పుట్టిన ఆయన కుల వివక్షపై పోరాటం చేశారని అన్నారు. పూలే గొప్ప విద్యావేత్త, సామాజిక తత్త్వవేత్త, ఉద్యమ కారుడని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని మహాబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌ డివిజన్‌ కేంద్రంలో పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

Tags:    

Similar News