కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి కౌంటర్

Update: 2020-12-12 14:44 GMT

వరంగల్ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే నిధులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వరద సమయంలో, కరోనా కష్టకాలంలో బయటకు రాని బీజేపీ నేతలు ఇప్పుడు ఎన్నికలు రాగానే కనిపిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తరహా ఇక్కడ మతం, గుడి రాజకీయాలు పని చేయవని అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీపై కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు.

Tags:    

Similar News