అమృత రాజీకి వస్తుందని మారుతీరావు చాలా కాలం ఎదురుచూశారని ఆయన తరుపు న్యాయవాది వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. తనవద్దకు ఎప్పుడు వచ్చినా కూతురు గురించే ఎక్కువగా మాట్లాడేవాడని తెలిపారు. అమృత వేరే వివాహం చేసుకున్నా ఎప్పటికైనా తన వద్దకు వస్తుందని మారుతీరావు అనుకునేవాడని వివరించారు. కూతుర్ని కలవాలనుకున్నాడని, రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాడని అయితే, అమృత కొత్త కేసులు పెట్టడంతో ఆయన ఆవేదన చెందాడని లాయర్ తెలిపారు. కేసులో శిక్ష పడుతుందని మారుతీరావుకు తెలుసని చెప్పారు. అమృత వస్తే, శిక్ష పడదని మారుతీరావు ఆశపడ్డారని వెంకట సుబ్బారెడ్డి చెప్పారు.