Adilabad: విషాదం.. పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
Adilabad: రిమ్స్లో చికిత్స పొందుతూ మృతిచెందిన పల్లవి
Adilabad: విషాదం.. పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
Adilabad: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారీ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వివాహిత పల్లవి మృతి చెందింది. అయితే భార్య మరణంతో మనస్థాపానికి గురైన భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్ ఆవరణలోనే పురుగుల మందు తాగి భర్త విజయ్ సూసైడ్ చేసుకున్నాడు. వివాహం జరిగి ఏడాది పూర్తవకముందే దంపతులు చనిపోవడంపై ఇద్దరి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.