Mulugu: ములుగు జిల్లాలో హై అలర్ట్

* ఆగస్టు 3వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు *మావోయిస్టు అగ్రనేతలు పాల్గొంటారని సమాచారం *ఏటూరు నాగారంలో ముమ్మర తనిఖీలు

Update: 2021-07-30 06:39 GMT

ములుగు జిల్లాలో హై అలర్ట్ 

Mulugu: మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు సందర్భంగా ములుగు జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. వారోత్సవాల్లో మావోయిస్టు అగ్రనేతలు పాల్గొంటారన్న సమాచారంతో అప్రమత్తమయ్యారు. ఏటూరు నాగారం మండలంలోని కొండాయి, కొత్తూరు, ఐలాపూర్, దొడ్ల, సండ్రగూడెం, చింతలమోరి, రాయబంధం, లింగపూర్ అటవీ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేడుతున్నారు. మావోలకు గొత్తికోయలు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉండటంతో గొత్తికోయ ఆవాస ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టారు.

Tags:    

Similar News