హైదరాబాద్ బంజారాహిల్స్లో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. జనాలపైకి రాళ్లతో దాడికి ప్రయత్నిస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో భయాందోళనకు గురైన జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులపైనా కూడా దాడికి పాల్పడ్డాడు.
కొద్దిసేపు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు తాడుతో కట్టేసి ఆటోలో పోలీస్స్టేషన్కు తరలించారు. అతడిని తిరుమలగిరికి చెందిన రక్షక్రాజుగా గుర్తించారు. ప్రేమలో విఫలమై ఇలా పిచ్చిగా వ్యవహరిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అనంతరం అతడ్ని బంజారాహిల్స్ పోలీసులు పునరావాస కేంద్రానికి తరలించారు.