అల్వాల్‌లో దారుణం.. పసివాడిపై ప్రతాపం

Update: 2019-11-11 06:03 GMT

సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ లో దారుణం జరిగింది. అపార్ట్ మెంట్ గొడవలు మనసులో పెట్టుకుని క్రాంతి స్వరూప్ అనే వ్యక్తి జయంత్ అనే బాలుడిని చితకబాదాడు. చిన్నారిని ఎక్కడపడితే అక్కడ తీవ్రంగా కొట్టాడు.

అపార్ట్ మెంట్ పార్కింగ్ వద్దకు సైకిల్‌తో వెళుతున్న జయంత్ ను క్రాంతి స్వరూప్ వెంబడించాడు. సైకిల్ కు స్టాండ్ వేస్తుండగా జయంత్ ను క్రాంతి స్వరూప్ తల, వీపు పై కొట్టాడు. గట్టిగా చెంపలు వాయించాడు. రెండు చేతులతో పైకి లేపి కిందకు వేశాడు. చేతులు విరిచి చెంపలకేసి కొట్టాడు. లిఫ్ట్ వద్దకు ఏడుస్తూ వెళుతున్న జయంత్ ను క్రాంతి స్వరూప్ చితకబాదుతూ తీసుకెళ్లాడు. ఈ దారుణ దృశ్యం అపార్ట్ మెంట్ లోని సీసీ టీవీలో రికార్డ్ అయింది. చిన్నారిని గొడ్డును బాదినట్లు బాదిన క్రాంతి స్వరూప్ పై హత్యా నేరం కింద కేసు నమోదుచేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. 

Tags:    

Similar News