వైభవంగా సాగుతున్న లష్కర్‌ బోనాలు....

Update: 2019-07-21 03:39 GMT

లష్కర్‌ బోనాలు.. వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజామునే వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి.. దర్శించుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు.. తొలి బోనం సమర్పించారు. తెల్లవారుజామున 4 గంటల 5 నిమిషాలకు.. మంత్రి తలసాని.. అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణలో వర్షాలు బాగా కురిసి పాడిపంటలతో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు మంత్రి తలసాని తెలిపారు.

ఇటు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో నేతలు క్యూ కడుతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు అమ్మవారికి బోనం సమర్పించేందుకు వేలాదిగా భక్తులు పోటెత్తారు. దీంతో సికింద్రాబాద్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ప్యారడైజ్‌ నుంచి ఆలయం వరకు భక్తులతో వీధులన్నీ నిండిపోయాయి.  

Tags:    

Similar News