ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందన

Update: 2021-03-01 07:47 GMT

ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందన

ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ట్వీట్‌పై ఘాటుగా స్పందించారు మంత్రి కేటీఆర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ గేటు బ‌య‌ట సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల క‌ల్లా వ‌స్తాను.. మీరూ రండి.. చ‌ర్చిద్దాం అంటూ ఆదివారం రామ‌చంద‌ర్‌రావు ట్వీట్ చేశారు. దీనిపై సోమ‌వారం ట్విట‌ర్‌లో కేటీఆర్ స్పందించారు. మోడీ సర్కార్‌ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఎవరికిచ్చారో చెప్పాలని ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. అలాగే.. జన్‌ధన్‌ ఖాతా దారుల అకౌంట్లో 15లక్షలు జమ చేస్తామన్నారు..చేశారా.. అని ప్రశ్నించారు. ఎన్‌డీఏ అంటే నో డేటా అవలబుల్‌ అని ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


Tags:    

Similar News