ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నతో ట్వీట్

KTR Questions: తెలంగాణ పట్ల వివక్షత చూపడమెందుకని ప్రధాని మోడీని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.

Update: 2022-05-12 16:00 GMT

ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నతో ట్వీట్

KTR Questions: తెలంగాణ పట్ల వివక్షత చూపడమెందుకని ప్రధాని మోడీని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక మెడికల్ కాలేజీకూడా మంజూరుచేయలేదని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ప్రధానమంత్రి గుజరాత్‌కేనా?..భారతదేశానికా? అని మోడీని నిలదీశారు. ప్రగతిశీలమైన తెలంగాణపై వివక్షత ఎందుకని ప్రశ్నించారు. గుజరాత్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. ‎

ఈ సందర్భంగా ఆయుబ్ పటేల్ అనే వ్యక్తితో మోడీ మాట్లాడుతూ..భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను మంత్రి కేటీఆర్..రీట్వీట్ చేస్తూ ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఒక్కమెడికల్ కాలేజీనికూడా మంజూరు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ చర్యతో వైద్యవిద్యకు దూరమయ్యే యువత పరిస్థితి ఏంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.


Tags:    

Similar News