Konda Surekha: బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు చేసిందేమీ లేదు
Konda Surekha: విద్యా, వైద్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
Konda Surekha: బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు చేసిందేమీ లేదు
Konda Surekha: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు పేదలకు ఏ మాత్రం ఉపయోగపడలేదన్నారు మంత్రి కొండా సురేఖ. విద్యా, వైద్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. పర్సంటేజీ కోసం వరంగల్లో నిజాం కాలం నాటి సెంట్రల్ జైలును కూల్చి వేసి.. కొత్త హాస్పిటల్ నిర్మిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఎంజీఎం హాస్పిటల్లో సరైన వసతులు కల్పించలేదన్నారు మంత్రి కొండా సురేఖ. ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి.. కొత్త ఆస్తులను బీఆర్ఎస్ కోసమే ఏర్పరచుకున్నారని మంత్రి ఆరోపించారు.