కాంగ్రెస్కు ఊహించని షాకిచ్చేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి ప్రయత్నాలు.. !
కాంగ్రెస్ను వీడెందుకు సిద్ధమైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చేలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే లోపే కాంగ్రెస్ను చావు దెబ్బ తీసేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్లోని అసంతృప్త నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జగ్గారెడ్డితో పాటు పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న వారితో టచ్లో ఉన్నట్టు సమాచారం.
కాగా గత కొంతకాలంగా పీసీసీపై ఆగ్రహంగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలను కడిగిపారేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఉత్తమ్ బాధ్యత తీసుకోవాలంటూ గత కొంతకాలంగా వాదిస్తూ వచ్చిన ఆయన ఈ సారి అధినాయకులపై డైరెక్ట్గా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చే పరిస్థితి లేదని ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్కు సాధ్యం కాదన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీడినా సీఎల్పీ విలీనం అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ఎదుర్కోవడం ఒక్క బీజేపీకే సాధ్యమని నిన్న రాజగోపాల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి కాంగ్రెస్కి ఊహించని షాక్ ఇస్తారో లేదో వేచిచూడాలి.