Kodandaram: మంత్రి ఈటలపై కక్ష సాధింపు చర్యలు- కోదండరాం

Kodandaram: కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఉద్యమకారులు ఏకం కావాలి -కోదండరాం * రాజకీయ అవసరాల కోసమే విచారణలు -కోదండరాం

Update: 2021-05-01 09:57 GMT

కోదండరాం (ఫైల్ ఇమేజ్)

Kodandaram: సీఎం కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఉద్యమకారులు ఏకం కావాల్సిన సమయమొచ్చిందని అన్నారు ప్రొఫెసర్‌ కోదండరాం. మంత్రి ఈటలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్న ఆయన.. ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికే భూ వివాదాలను కేసీఆర్‌ ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకొన్న కేసీఆర్‌.. అదే ఉద్యమంలో చిత్తశుద్ధితో పనిచేసిన వారిని అణగదొక్కుతున్నారని విమర్శించారు. మంత్రి ఈటలపై విచారణకు ఆదేశించినట్టే.. కేటీఆర్‌, మల్లారెడ్డి, ముత్తిరెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిలపై కూడా ఎంక్వయిరీ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు కోదండరాం.

Tags:    

Similar News