ఫ్రంట్‌ అంటూ తిరిగినవారికి ఏపీలో టెంట్‌ లేకుండా పోయింది: కిషన్‌రెడ్డి

Update: 2019-07-07 09:00 GMT

రానున్న రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రకంపనలు సృష్టించబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఒక్క శాతం ఓటింగ్ నుంచి పుంజకుని అస్సాం, త్రిపురలో అధికారంలోకి వచ్చినట్లే తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫ్రంట్‌ అంటూ తిరిగినవారికి ఏపీలో టెంట్‌ లేకుండా పోయిందన్నారు. విజయవాడలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని, ఇక ఆ పార్టీ కొలుకోదన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుమారుడినే గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. 

Tags:    

Similar News