తాజాగా కరీంనగర్లో ఓ వర్గం ప్రజలను మరో వర్గం వారిపై దాడికి ఉసిగొల్పేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్కు ఊరట లభించింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై ఎలాంటి కేసు నమోదు చేయడం కుదరదన్నారు కరీంనగర్ సీపీ కమలాహసన్ రెడ్డి. అక్బరుద్దీన్ కరీంనగర్ లో సభలో మాట్లాడిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా లేవన్నారు. అక్బరుద్దిన్ స్పీచ్ పై బీజేపీ ఫిర్యాదు చేయడంతో న్యాయనిపుణులతో క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పారు.
కాగా కొందరు వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రసంగానికి కొన్ని పదాలను జోడించి అర్థం మారేలా చేస్తున్నారని అక్బరుద్దీన్ ఆరోపించారు. తన ప్రసంగం ద్వారా తాను రాజ్యాంగాన్ని ఏ రకంగానూ ఉల్లంఘించలేదని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ఈ నెల 23న కరీంనగర్లో పర్యటించిన అక్బరుద్దీన్ ఒవైసీ అక్కడ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఈ మొత్తం దుమారం చెలరేగింది.