Kalvakuntla Kavitha: సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలపై కాంగ్రెస్ ద్రోహం
Kalvakuntla Kavitha: సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ద్రోహం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
Kalvakuntla Kavitha: సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ద్రోహం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రిటైర్డ్మెంట్ తర్వాత తమ పిల్లలకి ఉద్యోగం ఇప్పించాలనుకున్న వారి ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ అన్ఫిట్ కోసం 129 మంది దరఖాస్తు పెట్టుకుంటే 23 మందికి మాత్రమే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి తాము అంగీకరించమని స్పష్టం చేశారు. కార్మికులకు న్యాయం జరగాలని.. లేదంటే ప్రజా పోరాటాల ద్వారానే వారికి బుద్ది చెబుతామని కవిత హెచ్చరించారు.