Kadiyam Srihari: దళితబంధును పూర్తిగా అమలు చేయకపోతే టీఆర్ఎస్ కే నష్టం

*దళితబంధును పూర్తి స్థాయిలో అమలు చేయాలి లేకుంటే టీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోతుంది *దళితుల వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి ఉంటుంది

Update: 2021-08-14 14:28 GMT

కడియం శ్రీహరి (ఫైల్ ఫోటో)

Kadiyam Srihari: దళిత బంధు అమలుపై టీఆర్ ఎస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయాలని లేకుంటే టీఆర్ ఎస్ తీవ్రంగా నష‌్టపోతుందని కామెంట్ చేశారు. దళిత బంధును నీరు గార్చొద్దని పథకం అమలు చేయకుంటే టీఆర్ ఎస్ కు చెడ్డ పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజీ గూడెంలో శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News