తెలంగాణ కేబినెట్ విస్తరణతో అధికార పార్టీలో అసంతృప్తి కొనసాగుతోంది. కేబినెట్ లో బెర్త్ ఆశించిన మాజీ మంత్రి జోగురామన్న ఆలిగి అజ్ఞాతంలోకి వెళ్లారు. మరో టీఆర్ఎస్ నేత మైనంపల్లి కూడా అదే బాటలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో జోగురామన్న గన్మెన్లను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసినట్లు తెలుస్తోంది. కనీసం కుటుంబ సభ్యులకు కూడా అందుబాటులో లేరని సమాచారం. దాంతో ఆయన ఎక్కడికి వెళ్లారని.. ఇటు కుటుంబ సభ్యులు, అటు పార్టీ వర్గాల్లోనూ టెన్షన్ నెలకొంది.