మొన్న వృద్ధురాలి పక్కన మెట్లపై కూర్చున్న కలెక్టర్.. ఇవాళ పట్టణ ప్రగతిలో..

Update: 2020-02-29 08:24 GMT
కలెక్టర్ అబ్దుల్ ఆజిం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రోజుకో రకంగా వార్తల్లో కనిపిస్తున్నారు. సామాన్య ప్రజలతో కలిసిపోయి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న వృద్ధురాలి పక్కన మెట్లపై కూర్చున్న కలెక్టర్ అబ్దుల్ ఆజిం ఆమెను ఆప్యాయంగా పలకరించి సమస్య పరిష్కరించారు.

ఇవాళ పట్టణ ప్రగతిలో భాగంగా శ్మశానవాటిక కోసం స్థల అన్వేషణ చేపట్టారు. అధికారులతో కలిసి ఫారెస్ట్ ఏరియాలో పర్యటించారు. అయితే మార్గ మధ్యలో ఓ గొయ్యి రావడంతో జంప్ చేస్తూ ముందుకు సాగారు. అధికారులు సైతం కలెక్టర్ తరహాలో జంప్ చేయడానికి ప్రయత్నించారు. 

Tags:    

Similar News