తెలంగాణ మంత్రి జగదీశ్వర్రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించే క్రమంలో కన్నెపల్లి పంప్హౌస్కు చేరుకున్న ఆయన అక్కడి లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. గంటపాటు లిఫ్ట్లోనే ఇరుక్కుపోయిన జగదీశ్ రెడ్డిని చివరకు ఆయన భద్రతా సిబ్బంది లిఫ్ట్ అద్దాలు పగులగొట్టి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. పరిమితి కంటే ఎక్కువ మంది ఉండటంతోనే లిఫ్ట్ నిలిచిపోయిందని నిర్వాహకులు తెలిపారు.