Jadcherla: మార్చురీలో శవాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన.. నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు!

Jadcherla: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Update: 2026-03-03 09:05 GMT

Jadcherla: మార్చురీలో శవాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన.. నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు!

Jadcherla: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ సహా నలుగురిని సస్పెండ్‌ చేసింది. ఘటనపై hmtv కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై ప్రభుత్వం స్పందించి ఈ మేరకు చర్యలు తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ఆయన విచారణ చేపట్టారు. అనంతరం సూపరింటెండెంట్‌ చంద్రకళ, ఆర్‌ఎంవో హరినాథ్‌, డ్యూటీ డాక్టర్‌, ఎంఎస్‌వోపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

Full View

Tags:    

Similar News