Hyd News: హైదరాబాద్‌ ఉప్పల్‌లో అంతర్‌రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్స్‌ అరెస్ట్

Hyd News: రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తరలిస్తుండగా పట్టివేత

Update: 2024-04-16 11:54 GMT

Hyd News: హైదరాబాద్‌ ఉప్పల్‌లో అంతర్‌రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్స్‌ అరెస్ట్

Hyd News: డ్రగ్స్‌ నియంత్రణపై ఫోకస్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు..విస్తృతంగా తనిఖీలు చేస్తూ మత్తు పదార్థాలను విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే..ఉప్పల్‌లో అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్స్‌‌ను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు MDMA, ఓపీఎం డ్రగ్స్‌ తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు..ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 100 గ్రాముల MDMA 500 గ్రాముల నల్లమందు, 4 మొబైల్స్‌ సీజ్‌ చేసి.. NDPS యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. గత కొన్నేళ్లుగా రాజస్థాన్ నుండి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజస్థాన్ లో గ్రామ్ MDMA 5వేలకు, గ్రామ్ ఓపియం 2 వేలకు కొని.. హైదరాబాద్ లో 10 నుంచి 12 వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News