బాసర అమ్మవారి ప్రసాదంలో పురుగులు

Update: 2019-06-22 12:50 GMT

బాసర అమ్మవారి ప్రసాదంలో పురుగులు రావడం కలకలం రేపుతోంది. దేవస్థానం విక్రయించిన లడ్డూలో బొద్దింకను చూసిన భక్తులు ఖంగుతిన్నారు. లడ్డూ తయారీలో నాణ్యత లోపించిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యం కలిగిన అమ్మవారి ప్రసాదంలో పురుగులు రావటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అమ్మవారి ప్రసాదంలో పురుగులు, చెత్త రావటం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయినా అధికారుల తీరులో మార్పురాకపోగా ఈ సంఘటన మరల పునరావృతం కావటంపై భక్తులు, గ్రామస్తులు మండిపడుతున్నారు. 

Tags:    

Similar News