Coronavirus: ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపుతోంది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ తెలిపారు. ఓ పీజీ విద్యార్థికి ముందుగా కరోనా సోకినట్లు తేలడంతో.. అతడితో కాంటాక్ట్లో ఉన్నవారికి టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది.
దీంతో అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం రీడింగ్ రూంను మూసేయడంతోపాటు ఉస్మానియా హాస్టల్లో ఉన్న 296 మంది టెస్టులు చేశారు. వీరిలో 180 మంది అమ్మాయిలు ఉండగా.. 116 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 12 మందికి పాజిటివ్గా తేలిందని, మిగిలిన వారి ఫలితాలు బుధవారం వచ్చే అవకాశముందని ప్రిన్సిపల్ వెల్లడించారు. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థులంతా వసతిగృహంలోనే ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 20 నుండి పీజీ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి