హైదరాబాద్ మెట్రో రైల్ సేవలకు మరోసారి అంతరాయం

-అమీర్‌పేట నుంచి రాయదుర్గం మార్గంలో ఆగిన మెట్రో -గంట పాటు నిలిచిపోయిన సేవలు -త్రీవ ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు

Update: 2020-01-08 05:23 GMT

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ- అమీర్‌పేట మార్గంలో మెట్రో రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతోనే రైళ్లను నిలిపివేసినట్లు అధికారులు వివరించారు. ఉదయం నుంచి ప్రయాణికులతో అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ కిక్కిరిసిపోయింది. గంట నుంచి మెట్రో రైళ్ల సేవలు నిలిచిపోవడంతో మెట్రో స్టేషన్‌లోనే ప్రయాణికులు ఉన్నారు.

హైటెక్ సిటీ- అమీర్‌పేట మధ్య మెట్రో సేవలను వినియోగించుకోవాలనుకున్న ప్రయాణికులు మెట్రో స్టేషన్‌లకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు.ఉదయం 9 గంటల నుంచి సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు త్రీవ ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో గంటన్నర తర్వాత మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి.

 


Tags:    

Similar News