Hyderabad: మైలార్దేవ్పల్లిలో కారు బీభత్సం.. ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి
Hyderabad: హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది.
Hyderabad: హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే స్వెటర్లు అమ్ముకుని జీవనం సాగిస్తున్న ఓ కుటుంబాన్ని ఇన్నోవా కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో దీపక్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కారులో ముగ్గురు వ్యక్తులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ముగ్గురు తప్పించుకుని పారిపోయారు. పరారీలో ఉన్నవారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.