హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉద్రిక్తంగా మారిన మంత్రి కెటిఆర్ పర్యటన

Update: 2021-01-09 10:57 GMT

KTR (file image)

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ముషీరాబాద్‌లో టీఆర్ఎస్‌, బీజేపీ నేతలు బాహాబాహికి దిగారు. ముషీరాబాద్‌ ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. ప్రోటోకాల్‌ పాటించడంలేదని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్‌ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ కాన్వాయ్‌ను బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు.

Full View


Tags:    

Similar News