కరోనా వైరస్ కారణంగా హైదరాబాద్లోని వివిధ హాస్టళ్లలో ఉంటున్న వారికి కష్టాలు మొదలయ్యాయి. అధికారుల ఆదేశాలతో నిర్వాహకులు ఆశ్రయం పొందుతున్న వారిని ఖాళీ చేయాలని సూచిస్తున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునేవాళ్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీంతో తాము ఎక్కడికి వెళ్లాలంటూ విద్యార్థులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఎస్సార్ నగర్, పంజాగుట్ట, రాయదుర్గం పోలీస్స్టేషన్ల వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. సొంతూళ్లకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తమ పరిస్థితి ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమకు పరిష్కారం చూపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.