Hyderabad: ఓయూ వైస్ చాన్స్‎లర్ ఛాంబర్ ముందు NSUI ఆందోళన

Hyderabad: రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇవ్వాలని డిమాండ్

Update: 2022-05-01 12:00 GMT

Hyderabad: ఓయూ వైస్ చాన్స్‎లర్ ఛాంబర్ ముందు NSUI ఆందోళన

Hyderabad: హైదరాబాద్ ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 6 రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతివ్వాలని కోరుతూ NSUI నేతలు ఆందోళనకు దిగారు. ఓయూ అధికారుల తీరును నిరసిస్తూ.. NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఓయూ పరిపాలన భవనం ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. బల్మూరి వెంకట్ సహా మరో 17 మంది NSUI నేతలను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. విషయం తెలుసుకున్న NSUI కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌ ముందు నిరసనకు దిగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Tags:    

Similar News