తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్సీలు ఇటీవల టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో విలీనం అయినట్టు శాసనమండలి ఛైర్మెన్ కు లేఖ కూడా ఇచ్చారు. అయితే ఈ విలీనాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. శాసనమండలి విడుదల చేసిన బులిటెన్ నంబర్-9 రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు అసెంబ్లీ లా సెక్రటరీ,మండలి ఛైర్మన్, తెలంగాణ సీఎస్తోపాటు ఎమ్మెల్సీలు ఎమ్మెస్ ప్రభాకర్,దామోదర్రెడ్డి, ఆకుల లలిత… సంతోష్రెడ్డికి నోటీసులిచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.