తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై విచారణ చేపట్టిన హైకోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో సరైన ఆధారాలు లేవని హైకోర్టు సీరియస్ అయింది. కౌంటర్లో పేర్కొన్న అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మున్సిపల్ ఎన్నికలపై పూర్తి అభ్యంతరాలపై పూర్తి వివరాలు అందించాలని ఆదేశించింది. ఆగస్టు 20 న మరోసారి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.