నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

Nizam Sagar Project: ప్రాజెక్టుకు 29వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Update: 2022-09-10 07:15 GMT

నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద 

Nizam Sagar Project: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎగువన కురుస్తు్న్న వర్షాలతో ప్రాజెక్టులోకి 29వేల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 6గేట్లు ఎత్తి మంజీరలోకి 51వేల 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,404 అడుగులకు చేరుకుంది. నీటి సామర్థ్యం 17 పాయింట్ 802 టీఎంసీలు ఉండగా... ప్రస్తుతం 17 పాయింట్ 658 టీఎంసీలకు చేరుకుంది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో మంజీర పరివాహక ప్రాంత ప్రజలను ప్రాజెక్టు అధికారులు అప్రమత్తం చేశారు.

Tags:    

Similar News