హైదరాబాద్లో హవాలా ముఠా గుట్టును రట్టుచేశారు పోలీసులు. సుమారు ఐదు కోట్ల నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందుతులందరూ గుజరాత్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు వివరాలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడిస్తూ ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు రెండు కార్లు, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదర్గూడలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న గుజరాత్కు చెందిన వీరు హవాలా రాకెట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపన్నుశాఖ అధికారులకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.