గత ఏడాది నల్గొండ జిల్లా మిర్యాగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రణయ్ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రణయ్ భార్య అమృత ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని ప్రయాత్నాలు చేసినా న్యాయం జరిగే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని అమృత అన్నారు. ప్రణయ్ తండ్రి బాలస్వామి కూడా ప్రస్తుత పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.