హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కేసులో కీలక సాక్ష్యాల సేకరణ

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించారు.

Update: 2019-08-10 06:33 GMT

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి కేసులో కీలక సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించారు. సీరియల్‌ అత్యాచారాలు చేసి యువతులను దారుణంగా హత్యచేశాడని ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ లో వెల్లడైంది. అమ్మాయిల మృతదేహాలపై ఉన్న రక్తపు మరకలు శ్రీనివాస్‌ రెడ్డిగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ తేల్చింది. హత్య జరిగిన ప్రదేశంలో శ్రీనివాస్‌రెడ్డి సెల్‌ సిగ్నల్స్‌‌ను పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి కేసులో పోలీసులు 300 మంది సాక్షులను విచారించారు. సాక్ష్యాలన్నీ సేకరించి కోర్టుకు అందజేశారు. ఈ కేసు విచారణను ఫాస్ట్‌ట్రాక్ కోర్ట్ ద్వారా విచారణ నిర్వహించనున్నట్టు సమాచారం.

Tags:    

Similar News