హాజీపూర్ వరస హత్యల నిందితుడు మర్రి శ్రీనివాస్రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలని హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. దిశ నిందితుల మాదిరిగానే హాజిపూర్ ఘటనలో పరిష్కారం చూపాలన్నారు. తక్షణమే శ్రీనివారెడ్డిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు గ్రామ పంచాయితీ వద్ద గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఎనిమిది నెలలైనా ఇంకా విచారణ పేరుతో తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిశ నిందితుల మాదిరిగా తక్షణమే ఎందుకు శిక్షించడం లేదు ప్రశ్నిస్తున్నారు. ఎన్కౌంటర్ అయినా చేయాలి లేదంటే ఉరైనా తియ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనలో గ్రామస్తులు, బాధత కుటుంబ సభ్యులు, హాజీపూర్ గ్రామ సర్పంచ్ తిరుమల కవిత వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.