ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ నేత మరియు మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి టీఆర్ఎస్ నేతలు మరియు మంత్రులు అభినందనలు తెలిపారు .. అనంతరం మాట్లాడిన గుత్తా తనకి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. నా పైన అయన పెట్టుకున్నా నమ్మకాన్ని నిలబెడతానని ఆయన చెప్పుకొచ్చారు .ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడంలో సహకారం అందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ కి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సేవలు అందించానో ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అలాగే ప్రజలతో మమేకం అయి సేవ చేస్తానని అయన అన్నారు .