అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి.. గవర్నర్ తమిళిసై పిలుపు

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2022-07-16 10:45 GMT

అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి.. గవర్నర్ తమిళిసై పిలుపు

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. ఈరోజు రాత్రి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో కొత్తగూడెంకు బయల్దేరుతారు. నేడు ఢిల్లీలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇచ్చే విందుకు హాజరుకావాల్సి ఉండగా భద్రాచలం పర్యటన నేపథ్యంలో ఢిల్లీ టూర్‌ను గవర్నర్‌ రద్దు చేసుకున్నారు.

బూస్టర్ డోస్ వేసుకున్న తమిళిసై బూస్టర్ డోస్‌లకు అనుమతి ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున్న అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. రెండవ డోసు తీసుకోని వాళ్లు కూడా తీసుకోవాలని చెప్పారు. ముందే వర్షాకాలం జ్వరాలు, వాటర్ బాండ్ డిసీజ్ లు ఎక్కువ వస్తుంటాయన్న గవర్నర్ వాక్సిన్ తీసుకుంటే ప్రొటెక్షన్ ఉంటుందని తెలిపారు.

Tags:    

Similar News