తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. గడిచిన 20 ఏళ్లుగా దీనిపై బీజేపీ పోరాడుతుందని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవంపై గవర్నర్ కు వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. ఈనెల 17న పటాన్ చెరులో భారీ బహిరంగ సభ నిర్వహించడంతో పాటు ఊరూర జాతీయ జెండా ఎగురవేయనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.